
ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి వారి బ్రహ్మోత్సవాల నిర్వహణ, ఏప్రిల్ 1న జరగనున్న శ్రీరాములవారి కల్యాణోత్సవం సందర్భంగా జిల్లా అధికారులు, టిటిడి అధికారులతో జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి గురువారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. ఈ ఉత్సవాల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు.


















