
చింతలపూడి శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్, జంగారెడ్డిగూడెంలో రూ.101 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక మంచినీటి ప్రాజెక్టు పనులపై అధికారులతో, కాంట్రాక్టర్లతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. పట్టణ ప్రజల తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించడమే లక్ష్యంగా ఈ పనులు జరుగుతున్నాయని తెలిపారు.



















