
వేటపాలెం మండలం, పుల్లరిపాలెం పంచాయితీ పరిధిలోని బచ్చులువారి పాలెం గ్రామంలో నూతన ఆరోగ్య కేంద్రం నిర్మాణానికి చీరాల ఎమ్మెల్యే ఎం.ఎం. కొండయ్య యాదవ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చీరాల నియోజకవర్గ పరిధిలోని రెండు మండలాల్లో సుమారు 30 ఆరోగ్య కేంద్రాలు మంజూరయ్యాయని, ఈ నెలాఖరులోపు అన్నింటికీ శంకుస్థాపనలు పూర్తి చేస్తామని తెలిపారు.



















