
పర్చూరు నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకుని, తక్షణ పరిష్కారానికి చర్యలు చేపట్టేందుకు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఒక నూతన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇకపై ప్రజలు తమ సమస్యలను వాట్సాప్ ద్వారా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి తెలియజేయవచ్చు.



















