
చీరాల నియోజకవర్గ పరిధిలోని వేటపాలెం మండల సముద్ర తీర ప్రాంతంలో ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురవుతున్నాయని వైఎస్సార్సీపీ నాయకులు ఆరోపించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, ఆక్రమణలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ రెవెన్యూ అధికారులకు వినతిపత్రం సమర్పించారు.



















