
ప్రొద్దుటూరు పట్టణంలో తీవ్ర కలకలం రేకెత్తించిన ఘటనలో, ఒక తల్లి తన ముగ్గురు పిల్లలకు కూల్ డ్రింక్లో విషం కలిపి ఇచ్చి, తాను కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ దారుణ సంఘటనలో తల్లితో పాటు ముగ్గురు పిల్లలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.

















