అమరావతి, 2026-06-05
కృష్ణా జిల్లా గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలపై మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్.ఇందిరాదేవితో పాటు మరో 10 మంది ఉద్యోగులపై శాఖాపరమైన విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారనే ఫిర్యాదుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
కృష్ణా జిల్లా గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలపై మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్.ఇందిరాదేవితో పాటు మరో 10 మంది ఉద్యోగులపై శాఖాపరమైన విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారనే ఫిర్యాదుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
విచారణ ఎదుర్కొంటున్న సిబ్బంది
సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్.ఇందిరాదేవి, డెంటల్ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ జి.ఎం.వేణుగోపాల్, సివిల్ అసిస్టెంట్ సర్జన్లు డాక్టర్ డి.యాదయ్య, డాక్టర్ కె.వి.ఎస్.సత్యనారాయణ, డాక్టర్ సీహెచ్.రాజ్కుమార్, డాక్టర్ గట్టం లీనా, డాక్టర్ టి.సూదేశకుమార్, ఫార్మాసిస్ట్ గ్రేడ్-2 బి.విజయకుమార్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఎస్.నరసింహారావు, హెడ్నర్స్ సీహెచ్.విజయకుమారి, నర్సింగ్ సూపరింటెండెంట్ ఎన్.పద్మజపై ఈ విచారణ జరగనుంది.
విచారణాధికారి నియామకం
ఈ విచారణకు ప్రకాశం జిల్లా డీసీహెచ్ఎస్ డాక్టర్ కె.వి.లక్ష్మీకుమారిని విచారణ అధికారిగా ప్రభుత్వం నియమించింది. నిర్ణీత గడువులోగా విచారణ పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని సూచించింది. ఏసీబీ ఇన్స్పెక్టర్ జి.వి.వి.సత్యనారాయణను ఈ విచారణకు ప్రెజెంటింగ్ అధికారిగా నియమించారు.












