
మాజీ మంత్రివర్యులు ముద్రగడ పద్మనాభం గారి సంస్మరణ సభ రాజమండ్రిలోని మంజీరా సరోవర్ ప్రీమియర్లో సోమవారం మధ్యాహ్నం జరిగింది. ఈ సభలో ఏలూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు, కైకలూరు మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు (డీఎన్ఆర్) పాల్గొన్నారు. ముద్రగడ చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘన నివాళులర్పించిన ఆయన, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.



















