
ఏలూరు జిల్లాలో ఆగష్టు నెలలో 26 గ్రామాల్లో 14,153 మంది రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు. రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమీషనర్ జి. జయలక్ష్మితో జరిగిన జూమ్ సమీక్షలో ఆమె ఈ వివరాలు వెల్లడించారు. 22ఏ భూ సమస్యలకు సంబంధించి 410 దరఖాస్తులు రాగా, 107 ఆమోదించబడ్డాయి.


















