బాపట్ల, 11 జూలై 2026
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు ముంబైలో కుడి భుజానికి జరిగిన శస్త్రచికిత్స విజయవంతమైంది. ఆర్థోపెడిక్ సర్జన్ డా.దిన్షా పార్థీవాలా బృందం మూడున్నర గంటల పాటు ఈ సర్జరీని పూర్తి చేసింది. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు ముంబైలో జరిగిన కుడి భుజం శస్త్రచికిత్స విజయవంతమైంది. ఆర్థోపెడిక్ సర్జన్ డా.దిన్షా పార్థీవాలా నేతృత్వంలోని బృందం మూడున్నర గంటల పాటు ఈ సర్జరీని నిర్వహించింది.
ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నారని జనసేన పార్టీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఆపరేషన్ థియేటర్ నుంచి రికవరీ రూమ్ కు తరలించినట్లు, అనస్తీషియా ప్రభావం నుంచి ఆయన బయటకు వస్తున్నారని తెలిపింది.











